తన కూతురుతో ఆడినందుకు వ్యక్తిని చంపిన తండ్రి

Rajasthan Map
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో మంగళవారం ఘోరం జరిగింది. తన కూతురుతో ఆడుతున్నాడని ఆ కూతురు తండ్రి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. వివరాలలోకి వెళితే.. వీరేంద్ర కుమార్ అనే వ్యక్తికి నలభై ఏళ్లు ఉంటాయి. అతను ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను గత కొంతకాలంగా మారుతి నగర్‌లోనే తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరికి పిల్లలు లేరు. అయితే చుట్టుపక్కల ఉండే పిల్లలను వీరు ప్రేమగా చూసుకుంటారు. పిల్లలకు అప్పుడప్పుడు చాక్లెట్లు, మిఠాయిలు, బొమ్మలు తదితరాలు ఇస్తూ ప్రేమగా చూసుకుంటారు. విశ్రాంతి సమయంలో పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు.

అయితే వీరేంద్ర కుమార్ ఇంటి పక్కన ఉండే చోటే రామ్ అనే వ్యక్తి కూతురుతోనూ వీరేంద్ర కుమార్, ఆయన భార్య తరుచుగా ఆడుకుంటుంటారు. మంగళవారం ఉదయం వారితో తన కూతురు ఆడుకుంటుండగా చోటే రామ్ చూశాడు. ఆగ్రహం చెందిన చోటే రామ్ తన ఇంట్లో నుండి ఓ కొడవలి తీసుకు వచ్చి వీరేంద్ర కుమార్ తలపై బాదాడు. కొడవలితో పలుమార్లు కుమార్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతనిని దగ్గరలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అతను తీవ్రంగా గాయపడటంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతని వయస్సు నలభై ఏళ్లు ఉంటాయి. అంతిమ సమాచారం అందే సమయానికి నిందితుడు అరెస్టు జరగలేదు. కాగా గతంలోనే చోటే రామ్ తన కూతురుతో ఆడటంపై వీరేంద్ర కుమార్, ఆయన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+