హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ 'ఓదార్పు' తగ్గితే కాంగ్రెస్‌కు లబ్ధి: టిజి వెంకటేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 TG Venkatesh
హైదరాబాద్: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రభావం తగ్గితే ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఎక్కువ స్థానాలలో గెలుస్తుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర క్రమంగా తగ్గుతోందని, కొవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనమన్నారు.

ముఖ్యమంత్రి మార్పు కలలో కూడా జరగదన్నారు. ప్రస్తుతం కాంగ్రెసులో సిఎం రేసులో ఎవరూ లేరన్నారు. అసలు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెసు పార్టీలో కోరేవారు ఎవరూ కనబడటం లేదన్నారు. అలాంటప్పుడు ఆ ప్రశ్న ఎలా తలెత్తుతుందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదిన కొందరిని ఫూల్స్ చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి మార్పు వదంతులను కొందరు ప్రచారంలో పెట్టారని టిజి వెంకటేష్ చెప్పారు.

కాగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపథంలో ఎక్కడా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణా రెడ్డి వేరుగా అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారని, దీన్ని ప్రభుత్వాన్ని నిలదీయడంగా భావించడం చాలా పొరపాటు అని ఆయన చెప్పారు.

కాగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్టీ నేతలు కొందరు అంతర్గతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య ఆరోపించారు. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకొని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని చెప్పారు.

English summary

 Minister TG Venkatesh said YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's odarpu yatra image is decreasing gradually. He said Congress Party will get majority seats if Jagan's image decrease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X