వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అళగిరిపై పోరు: తప్పుకుంటానని స్టాలిన్ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Stalin
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెలో వారసత్వ పోరు ముదురుతోంది. సోదర వైరం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. కేంద్ర మంత్రి అళగిరి మనుషులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. ఎంకె ఆళగిరికి చెందిన 17 మంది పార్టీ నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. స్టాలిన్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరు కాకపోవడంపై వారికి ఈ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

పాలక అన్నాడియంకె ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా ఏప్రిల్ 14వ తేదీన స్టాలిన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరు కానందుకు జారీ అయిన షోకాజ్‌ నోటీసులకు వారంలోగా వివరణ ఇవ్వాలని అళగిరి మనుషులను ఆదేశించారు. అళిగిరి మనుషులపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీ కోశాధికారిగా తప్పుకుంటానని స్టాలిన్ హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ మధురై ఆఫీస్ బియరర్లందరికీ ఈ నెల 17వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇది అళగిరి సొంత ప్రాంతం. ఒకప్పుడు అన్నాడియంకెకు కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంలో అళగిరి ప్రధాన పాత్ర పోషించారు. వారసత్వ పోరు పార్టీలో మొదటి నుంచీ ఉన్నదే.

దక్షిణ తమిళనాడులో అత్యంత బలంగా ఉన్న అళగిరి పార్టీలో మార్పులను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే తాను పార్టీ నాయకత్వం కోసం పోటీ పడుతానని అళగిరి గతంలో అన్నారు. ఇరువురి పోరు మధ్య కరుణానిధి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

English summary
In a move that could further fuel the sibling rivalry in the DMK, showcause notices have been issued to 17 supporters of M K Alagiri, Union minister and party strongman, for not attending a public meeting convened by his younger brother M K Stalin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X