పరకాలకు: తెలంగాణలో అడుగిడనున్న విజయమ్మ!

వైయస్ విజయమ్మ మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కాగా రెండేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టేందుకు వచ్చినప్పుడు మానుకోట వద్ద తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వర్గీయులు, తెలంగాణవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్ తెలంగాణలో అడుగు పెట్టలేదు. రంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కుటుంబాలను పరామర్శించేందుకు మాత్రం వచ్చారు. కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో వైయస్ విజయమ్మ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె పరకాల నియోజకవర్గ పర్యటన ఎలా ఉంటుందో అనే చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే తాము విజయమ్మను అడ్డుకుంటామని తెలంగాణవాదులు ప్రకటించారని అంటున్నారు.
పరకాల ఉప ఎన్నికలలో కొండా సురేఖను అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కొండా మురళీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ కుటుంబం కార్యకర్తలకు అండగా ఉండటమే తమ విజయానికి దోహదపడుతుందని అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications