చనువు పెరిగింది: మోపిదేవితో వైయస్ జగన్ గేమ్స్!

అంతేకాదు వీరిద్దరూ నిత్యం పలు అంశాలపై చర్చించుకుంటున్నారట. మోపిదివి జైలుకు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతతో ఉన్నప్పటికీ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. గత నెల 27న వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి కోఠిలోని సిబిఐ కార్యాలయంలోనే అతనిని ఉంచారు. 28న కోర్టులో హాజరు పర్చారు. అతనిని కోర్టు జ్యూడిషియల్ రిమాండుకు తరలించడంతో చంచల్గూడ జైలుకు పంపించారు.
మొదట్లో జగన్ ఒంటరిగా ముభావంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత్తర్వాత కాస్త తేరుకొని తోటి ఖైదీ సునీల్ రెడ్డితో షటిల్ ఆడటం, అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడటం చేశారు. మొదట బ్రెడ్, చపాతీలు తీసుకున్నారు. టీలు ఎక్కువగా తాగారు. కోర్టు అతనిని సిబిఐ కస్టడీకి అనుమతించడంతో ఆదివారం నుండి సిబిఐ అతనిని విచారిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా కేర్ నుండి డిశ్చార్జ్ చేశాక చంచల్గూడ జైలుకు తరలించారు.
ఆయన కూడా అక్కడ మొదట్లో ముభావంగానే ఉన్నారట. ఆ తర్వాత ఆయన క్రమంగా తేరుకొన్నారు. ఇప్పుడు జగన్తో కలిసి షటిల్ ఆడుతున్నారట. కాగా ఉదయం పదిన్నర గంటలకు జగన్ను సిబిఐ తమ కస్టడీకి తీసుకుంటుంది. ఐదు రోజుల కస్టడీలో మంగళవారం మూడో రోజు విచారణ జరగనుంది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications