చనువు పెరిగింది: మోపిదేవితో వైయస్ జగన్ గేమ్స్!

అంతేకాదు వీరిద్దరూ నిత్యం పలు అంశాలపై చర్చించుకుంటున్నారట. మోపిదివి జైలుకు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతతో ఉన్నప్పటికీ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. గత నెల 27న వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి కోఠిలోని సిబిఐ కార్యాలయంలోనే అతనిని ఉంచారు. 28న కోర్టులో హాజరు పర్చారు. అతనిని కోర్టు జ్యూడిషియల్ రిమాండుకు తరలించడంతో చంచల్గూడ జైలుకు పంపించారు.
మొదట్లో జగన్ ఒంటరిగా ముభావంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత్తర్వాత కాస్త తేరుకొని తోటి ఖైదీ సునీల్ రెడ్డితో షటిల్ ఆడటం, అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడటం చేశారు. మొదట బ్రెడ్, చపాతీలు తీసుకున్నారు. టీలు ఎక్కువగా తాగారు. కోర్టు అతనిని సిబిఐ కస్టడీకి అనుమతించడంతో ఆదివారం నుండి సిబిఐ అతనిని విచారిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా కేర్ నుండి డిశ్చార్జ్ చేశాక చంచల్గూడ జైలుకు తరలించారు.
ఆయన కూడా అక్కడ మొదట్లో ముభావంగానే ఉన్నారట. ఆ తర్వాత ఆయన క్రమంగా తేరుకొన్నారు. ఇప్పుడు జగన్తో కలిసి షటిల్ ఆడుతున్నారట. కాగా ఉదయం పదిన్నర గంటలకు జగన్ను సిబిఐ తమ కస్టడీకి తీసుకుంటుంది. ఐదు రోజుల కస్టడీలో మంగళవారం మూడో రోజు విచారణ జరగనుంది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications