చిరంజీవితో విహెచ్ భేటీ: జగన్పై పార్టీలో స్పష్టత రావాలి

అలా అభిప్రాయపడుతున్న కాంగ్రెసు నేతలు ఈ వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో ఫలితాలపై కాంగ్రెసు పార్టీలో అంతర్గతంగా మేథోమథనం జరగాలని విహెచ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సమన్వయ కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు. అజెండా లేకుండా కేవలం సానుభూతినే నమ్ముకున్న జగన్ పార్టీకి ఇకపై ఓట్లు పడవని చెప్పారు.
విహెచ్ ఆదివారం రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. వారిద్దరు ఇప ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత పైన కూడా చర్చించారు. కాగా చిరంజీవి ఉప ఎన్నికలపై తన నివేదికను ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లనున్న విషయం తెలిసిందే.
ఉప ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ శ్రేణులను కాంగ్రెసు నేతలు సమన్వయం చేయక పోవడం వల్లనే పదిహేను స్థానాలలో ఓటమి చెందామని చిరంజీవి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సానుభూతి వల్ల జగన్ పార్టీ గెలిచిందని చెబుతుండగా చిరంజీవి మాత్రం సానుభూతితో పాటు పార్టీలో సమన్వయం లేకపోవడం కూడా కారణమని చెబుతున్నారు. ఇదే ప్రధానంగా చిరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications