అనంతలో హత్య, కాంగ్రెసు నేతపై టిడిపై నేత దాడి

అదే జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుడు రామాంజనేయులును తెలుగుదేశం నేత వెంకటేశ్వర్లు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి న రామాంజనేయులును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
తిరుపతిలో రెండు నెలల క్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకి శనివారం ఉదయం లభ్యమైంది. గుంటూరులోని మల్లేశ్వరమ్మ అనే మహిళ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు బాలుడి ఆచూకీని గుర్తించారు. బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాలో తమ సోదరిని వేధిస్తున్న బావను మరుదులే మట్టుపెట్టిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి తన భార్య కొండమ్మను తరుచుగా వేధింపులకు గురి చేయసాగాడు. వారం రోజుల క్రితం ఆమెతో వెంకటేశ్వర రెడ్డి గొడవ పడడం ఆమె సోదరులకు తెలిసింది.
దాంతో ఆగ్రహించిన కొండమ్మ సోదరులు, మరి కొంత మందితో కలిసి వెంకటేశ్వర రెడ్డిపై కత్తులు, కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని స్థానికులు నిజామాబాద్ తరలిస్తుండగా అడ్డుకుని మరోసారి దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే మరణించాడు.












Click it and Unblock the Notifications