నెంబర్ టు: సోనియా రాజీ ఫార్ములా, పవార్ చల్లబడేనా

ప్రధాని దేశంలో లేనప్పుడు గతంలో ఆ పనులను ప్రణబ్ ముఖర్జీ చూసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను పవార్కు అప్పగిస్తామని, ఆయనతో పాటు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, పార్లమెంటులో కాంగ్రెసు పార్లమెంటరీ నేత కూడా పర్యవేక్షిస్తారని కాంగ్రెసు ఓ రాజీ ఫార్ములాను ప్రతిపాదించింది. తీవ్ర అసంతృప్తితో ఉన్న పవార్ శుక్రవారం ఉదయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన విషయం తెలిసిందే.
పవార్ తనను కలిసినప్పుడు సోనియా ఈ విషయాన్ని ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కోర్ కమిటీలో ఈ విషయంపై చర్చించి అనంతరం రాజీ ఫార్ములాపై ప్రకటన చేస్తారని సమాచారం. పవార్ డిమాండుకు కాంగ్రెసు కాస్త దిగొచ్చినట్లుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు మాత్రం ఇష్టపడినట్లుగా కనిపించడం లేదని కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని బట్టి అర్థమవుతోంది.
అయితే కాంగ్రెసు ప్రతిపాదించిన త్రిసభ్య కమిటీ ఫార్ములాకు శరద్ పవార్ చల్లబడతారో లేరో చూడాలి. ఈ కమిటీకి ఆయన అంగీకరించిన పక్షంలో రక్షణ శాఖను తనకు కేటాయించాలని కాంగ్రెసును డిమాండ్ చేసే అవకాశముందని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయి అవగానే యుపిఏలో నెంబర్ టు వివాదం తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications