Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అది వారి వ్యక్తిగతం: దానం, సబిత గొడవపై బొత్స

Botsa Satyanarayana
విజయనగరం: మంత్రులు దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి మధ్య గొడవ వారి వ్యక్తిగతమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇస్తాన్ ఆలయం వద్ద దానం నాగేందర్ హల్‌చల్ చేయడంపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి నిద్రపోతుండవచ్చునని ఆయన అన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై బొత్స సత్యనారాయణ శనివారం ప్రతిస్పందించారు. సబితా ఇంద్రారెడ్డికి, దానం నాగేందర్‌కు మధ్య తలెత్తిన వివాదంతో ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేదని ఆయన అన్నారు. ఆ విషయంపై తాను వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతిపక్షాల ఆందోళనలు ఉన్నాయని, స్వలాభం కోసమే ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటలను ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు.

సంక్షేమ పథకాలపై తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం విద్యార్థుల మనుగడ, అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు వ్యవహరించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనల్లో విద్యార్థులు పాలుపంచుకుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విధానాన్ని మారుస్తున్నట్లు, ఎత్తివేస్తున్నట్లు ప్రతిపక్షాలకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఫీజులు పెంచాలని అడుగుతున్న ప్రైవేట్ కళాశాలలను ఫీజులు తగ్గించాలని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.

వాన్‌పిక్ భూముల విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందులో దుక్కి దున్నడం ఏమిటని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్ భూముల్లో చంద్రబాబు శుక్రవారం ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన విషయం తెలిసిందే.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో కోతను బొత్స సత్యనారాయణ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చించి సూచనలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఉప సంఘం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. శుక్రవారం ఏ నిర్ణయం తీసుకోకుండా సమావేశం వాయిదా పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+