రాష్ట్రం ఫస్ట్... కారణం సోనియానే!: గాలి ముద్దుకృష్ణమ
దేశంలో జరుగుతున్న అన్ని కుంభకోణాలలో సోనియా పాత్ర ఉందన్నారు. సోనియా, రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేధీలలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలలో కాంగ్రెసు ఓడిపోయిందని, నైతికంగా వీరు దేశాన్ని పాలించే హక్కును కోల్పోయారన్నారు.
రాష్ట్ర కేబినెట్లో ఒకరిద్దరు మినహా మంత్రులందరూ కళంకితులేనని మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు శనివారం విమర్శించారు. కొందరు మం త్రులు, కాంగ్రెస్ నేతలు, చివరకు ముఖ్యమంత్రి కూడా జగన్కు కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జి ల్లా నరసరావుపేటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు నోటీసులు అందుకు న్న మంత్రులపై చర్యలు తీసుకోకుండా వారికి సీఎం కొమ్ముకాస్తున్నాడని చెప్పారు.
మంత్రి ధర్మాన రాజీనామా ఓ డ్రామా అని అభివర్ణించారు. మంత్రి బొత్సపై మద్యం, మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై గాలి బెయిల్ స్కామ్ల ఆరోపణలు ఉన్నాయని, హైదరాబాద్లోని ఆలయ భూముల విషయంలో దౌర్జన్యం చేసిన మంత్రిపై కేసు నమోదైంద ని, వీరిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం లో బొగ్గు, విమానాశ్రయాలు, విద్యుత్ కేటాయింపుల్లో రూ. 3 లక్షల కోట్లు కుంభకోణం జరిగిందని, ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నదని కోడెల విమర్శించారు.