చేసిన తప్పేంటో చెప్పండి: వైయస్ విజయమ్మకు బొత్స

ఫీజు రీయింబర్సుమెంట్సు పైన తెలుగుదేశం పార్టీకి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదన్నారు. కార్పోరేట్ కళాశాలలతో కుమ్మక్కై వారు పసలేని వాదనలు చేస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యాల శ్రేయస్సు కోసమే టిడిపి నేతలు అలా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నంత కాలం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడుతామన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నదే వైయస్ చివరి కోరిక అన్నారు.
తెలంగాణ సమస్య పరిష్కారం కోసం యుపిఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాము కూడా కోరుతున్నామని అన్నారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిల రాజీనామాలపై ఇప్పటికే వివరణ అడిగామని చెప్పారు. విద్యుత్ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వేరుగా అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యను విపక్షాలు రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications