సంతకం ఎందుకు చేయలేదంటే: లేఖపై దానం వివరణ

తెలంగాణ ప్రాంత మంత్రులు సంతకం పెట్టి అధిష్టానానికి పంపిన లేఖ తన వద్దకు రాలేదని చెప్పారు. గతంలో ఇచ్చిన లేఖలో తానే తొలి సంతకం పెట్టిన విషయాన్ని దానం గుర్తు చేశారు. ఈసారి మంత్రులు తన వద్దకు లేఖ పంపలేదు కాబట్టి తన సంతకం లేదని చెప్పారు. కాగా సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు సోనియాకు, పార్టీ కోర్ కమిటీ సభ్యులకు తెలంగాణ కోరుతూ లేఖ పంపిన విషయం తెలిసిందే.
వెంటనే తెలంగాణను ప్రకటించాలని వారు ఆ లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రకటిస్తే ఇరు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీ బలంగా తయారవుతుందని, లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని వారు సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు. సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాలని వారు కోరారు. తెలంగాణ తప్ప ప్యాకేజీలు వద్దని కోరారు.
కాగా మంత్రులు రాసిన ఈ లేఖలో రాజధానికి చెందిన ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ మినహా మిగతా తెలంగాణ ప్రాంత మంత్రులు అందరూ సంతకం చేశారు. ముఖేష్, దానం సంతకాలు చేయక పోవడాన్ని విలేకరులు ప్రశ్నించగా కాంగ్రెసు నేతలు మాత్రం అదేం లేదని, వారు కూడా తెలంగాణ కోరుకుంటున్నారని, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications