సంతకం ఎందుకు చేయలేదంటే: లేఖపై దానం వివరణ

తెలంగాణ ప్రాంత మంత్రులు సంతకం పెట్టి అధిష్టానానికి పంపిన లేఖ తన వద్దకు రాలేదని చెప్పారు. గతంలో ఇచ్చిన లేఖలో తానే తొలి సంతకం పెట్టిన విషయాన్ని దానం గుర్తు చేశారు. ఈసారి మంత్రులు తన వద్దకు లేఖ పంపలేదు కాబట్టి తన సంతకం లేదని చెప్పారు. కాగా సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు సోనియాకు, పార్టీ కోర్ కమిటీ సభ్యులకు తెలంగాణ కోరుతూ లేఖ పంపిన విషయం తెలిసిందే.
వెంటనే తెలంగాణను ప్రకటించాలని వారు ఆ లేఖలో అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రకటిస్తే ఇరు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీ బలంగా తయారవుతుందని, లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని వారు సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు. సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయాలని వారు కోరారు. తెలంగాణ తప్ప ప్యాకేజీలు వద్దని కోరారు.
కాగా మంత్రులు రాసిన ఈ లేఖలో రాజధానికి చెందిన ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ మినహా మిగతా తెలంగాణ ప్రాంత మంత్రులు అందరూ సంతకం చేశారు. ముఖేష్, దానం సంతకాలు చేయక పోవడాన్ని విలేకరులు ప్రశ్నించగా కాంగ్రెసు నేతలు మాత్రం అదేం లేదని, వారు కూడా తెలంగాణ కోరుకుంటున్నారని, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications