అస్వస్థతతో పరీక్షల మీద పరీక్షలు: శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స?

గత రెండు వారాలుగా శ్రీలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం వంటి సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు మహిళా జైలు సూపరింటిండెంట్కు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.
శ్రీలక్ష్మికి వైద్యం చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్ సలహా మేరకు శ్రీలక్ష్మిని మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు (నిమ్స్కు) తీసుకుని వెళ్లారు. నిమ్స్లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చునని అంటున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి జైలులో ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఒఎంసికి మేలు జరిగే విధంగా శ్రీలక్ష్మి జీవోలను జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెకు తొలుత బెయిల్ లభించినప్పటికీ ఆ తర్వాత రద్దయింది. దీంతో ఆమె జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications