కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి కోసం కన్నకొడుకును హత్య చేసిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ మాయలో పడి కన్న కొడుకునే ఓ మహిళ కడతేర్చింది. ప్రియుడికి, తనకు మధ్య అడ్డం వస్తున్నాడనే ఉద్దేశంతో ఆ తల్లి తన నాలుగేళ్ల కన్న కొడుకుని పొట్ట పెట్టుకుంది. ఈ సంఘటన గురువారంనాడు కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగింది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

బేతంచర్లలో ప్రియుడు బాషాతో పాటు కలిసి ఉంటున్న లక్ష్మి అనే మహిళ తన కుమారుడిని చంపి ఓర్వకల్లు మండలం చకునాపల్లి గ్రామంలోని తన భర్త ఇంటి వద్ద వదిలేయడానికి ప్రయత్నించింది. హత్యా నేరాన్ని భర్తపై మోపాలనే ఉద్దేశంతో ఆమె ఆ పనిచేసింది.

అయితే, స్థానికులు ఆమె కుమారుడి శవాన్ని తీసుకుని అక్కడ పెట్టడం గమనించి గ్రామస్థులు ఆమెను పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె కుమారుడి శవాన్ని కూడా పోలీసులకు అప్పగించారు.

భర్తను వదిలేసి గత 20 రోజులుగా లక్ష్మి బేతంచర్లలో బాషాతో కలిసి ఉంటోంది. తనతో రావాలని భర్త ఆమెను పదే పదే వేడుకున్నా వినలేదు. పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు. అయినా ఆమె వినలేదు. చివరకు కన్న కొడుకుని చంపి తన భర్త మీదికి నేరాన్ని వేయడానికి పూనుకుంది.

English summary
A lady killed her four years son to live with her lover. She abandoned her husband and residing with lover at Bethamcharla of Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X