తెలంగాణపై బాబు లేఖ: లగడపాటి ఫైర్, అడ్డుకుంటాం
రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే తలెత్తే సమస్యలపై చంద్రబాబు ఆలోచించారా అని ప్రశ్నంచారు. తన పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడానికే చంద్రబాబు ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో బాబు పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి ఘోర పరాజయం చవి చూసిందని, విభజనకు మద్దతు పలికితే ఆ కాస్తా కూడా ఉండదన్నారు.
రాష్ట్రం విభజిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలుగువారి ఐక్యత కోసమే టిడిపి అని పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ చెప్పారన్నారు. విభజనతో పలు సమస్యలు తలెత్తుతాయన్నారు. లగడపాటి చంద్రబాబుకు మూడు పేజీల లేఖ రాశారు. చంద్రబాబు లేఖ పైన ఆ పార్టీ సీమాంధ్ర నేతలు స్పందించాలని జోగి రమేష్ అన్నారు. సీమాంధ్రలో బాబు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. బాబు లేఖ ఓ డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.