చర్చలు సక్సెస్, తెలియకుండా చాలామందితో..: కెసిఆర్

చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఫలప్రదంగా ముగిశాయన్నారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. త్వరలో తుది విడత చర్చలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. తాను పలువురు సీనియర్లతో భేటీ అయ్యానని చెప్పారు. మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు.
త్వరలో సుదీర్ఘ చర్చలు జరిగి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. తాను ముగ్గురు నలుగురు నేతలతోనే మాట్లాడలేదని చాలామందితో మాట్లాడానని చెప్పారు. కాగా కెసిఆర్ గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఆ తర్వాత రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి ఆయన నెల రోజుల పాటు అక్కడే ఉండి తెలంగాణపై అధిష్టానంతో చర్చలు జరిపారు.
కెసిఆర్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తెరాస శ్రేణులు భారీగా అక్కడకు తరలి వెళ్లాయి. చర్చలు ఫలప్రదమైనవని ఆయన ప్రకటించినందు వల్ల ఆ పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఆయన కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు.












Click it and Unblock the Notifications