సాయికుమార్ బుట్టలో పడిన సౌరవ్ గంగూలీ?
మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం సూత్రదారి సాయి కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. అతని బ్యాంకుల పనితీరు గురించి పూర్తిగా తెలుసునని అనుకోవడానికే వీలుంది. కవరింగ్ లేఖ సాయంతో నిధులను మళ్లించడానికి అవకాశం ఉందని గుర్తించిన అతను తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశాడని అంటున్నారు. మొత్తం 165 సంస్థలను స్థాపించడంతో పాటు వన్ కార్డ్ - వన్ నే,షన్ పేరుతో క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు అన్నంటినీ ఒకే కార్డులో ఇస్తామని చెబుతూ పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాడు.
దీని ప్రచారానికే అతను మైనారిటీ కార్పోరేషన్ నుంచి కొల్లగొట్టిన ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని వార్తలు వచ్చాయి. తద్వారా బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవాలని కూడా అతను వ్యూహం రచించాడని మీడియా కథనాల సారాంశం. వన్ కార్డు వన్ నేషన్ విధానాన్ని కనీసం 300 కోట్ల రూపాయలకు విక్రయించాలని కూడా ఎత్తు వేశాడట.
ఆ రకంగా వచ్చిన డబ్బుల నుంచి ఎఫ్డిల ద్వారా కొల్లగొట్టిన 55 కోట్ల రూపాయలు చెల్లించేసి, మిగతా డబ్బుతో వ్యాపారాలు చేయాలని సాయికుమార్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. వన్ కార్డ్ వన్ నేషన్ విధానాన్ని అమ్మడానికి అతను కొన్ని సంస్థలతో బేరసారాలు కూడా ప్రారంభించాడని చెబుతు్నారు. ఈ కుంభకోణం బయటపడకపోతే సాయికుమార్ను పట్టుకోవడం కష్టంగానే ఉండేదని అంటున్నారు.
వన్ కార్డు వన్ నేషన్ డాట్ కామ్ పేరుతో ఓ వెబ్సైట్ కూడా ఏర్పాటైంది. దీన్ని డిఎస్ఆర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రిజిస్షర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. డిఎస్ఆర్ ల్యాబ్స్ ప్రమోటర్ ధనిరెడ్డి సుదర్శన్ రెడ్డి. మరో డైరెక్టర్ ఉపేంద్ర రాజు. దీంతో డిఎస్ఆర్ ల్యాబ్స్కు సాయికుమార్కు మధ్య గల సంబంధమేమిటనే విషయంపై కూడా సిఐడి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.