పదవులు కొత్తకాదన్నబాబు: వైఎస్పై కార్యకర్త కామెంట్

టిడిపి అధికారంలోకి రాగానే రైతులకు, పేదలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు ఎంతగా కష్టపడుతున్నా అప్పులే మిగిలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు 117 రోజుల పాటు పాదయాత్ర తలపెట్టానన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
కాగా అంతకుముందు చంద్రబాబు పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంటే చంద్రబాబు ఒంటి కాలిమీద లేస్తారు. ఓ కార్యకర్త వైయస్పై విమర్శలు చేసి చంద్రబాబును ఆకట్టుకున్నారు. వైయస్ పెద్ద అవినీతిపరుడు అని సదరు తెలుగు తమ్ముడు బాబు ఎదుట మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.
ఆయన హయాంలో మొత్తం అవినీతే జరిగింది తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అంతేకాదు యమలోకం కథ ఒకటి వినిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు చంద్రబాబు సైలెంట్గా వింటూ ఉండిపోవడం గమనార్హం. చంద్రబాబు పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లాలో ముగిసింది. సాయంత్రం ఆరున్నర గంటలకు కర్నూలు జిల్లాలో ప్రవేశించింది.












Click it and Unblock the Notifications