వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుల్బార్గా వద్ద రైలు బోగీల్లో మంటలు: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Train at Gulbarga catches fire
గుల్బర్గా: నెల్లూరు రైలు ప్రమాదం సంఘటనను మరిచిపోక ముందే కర్ణాటకలోని గుల్బర్గాలో రైలుకు మంటలు అంటున్నాయి. కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారంనాడు నిలిచి ఉన్న హైదరాబాద్ - షోలాపూర్ ప్యాసెంజర్ రైలు బోగీల్లో మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని గుల్బర్గా ఆస్పత్రికి తరలించారు.

రైలుకు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం తెలియడం లేదు. గుల్బార్గాలో ఆగిన తర్వాత మంగళవారం ఒంటి గంటన్నర ప్రాంతంలో రైలుకు మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వ్యాపించడం ప్రారంభించాయి. రైలులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా తేలడం లేదు.

పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బోగీల్లో ఎంత మంది ఉన్నారనే విషయం తేలడం లేదు. వివరాలు అందాల్సి ఉంది. హైదరాబాద్ - షోలాపూర్ రైలు ఆగి ఉన్న పట్టాల మీదుగా ఇతర రైళ్ల రాకపోకలను నిలిపేశారు.

English summary
Two passengers were killed and another seven injured when their train caught fire near Gulbarga in North Karnataka, 600 km from Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X