చంద్రబాబు-వైయస్ యాత్రలకు పోలిక లేదు: కోమటిరెడ్డి
కానీ ఇప్పుడు బాబు మాత్రం ఓట్లు, సీట్లు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎవరు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదన్నారు. నల్గొండ జిల్లాకు వైయస్సార్ చేసిన అభివృద్ధి పనులన్నీ ప్రస్తుతం కుంటుపడుతున్నాయన్నారు.
తెలంగాణపై 2009 డిసెంబర్ 9వ తేదిన చేసిన ప్రకటనను నిలబెట్టుకోకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ మనుగడ కష్టమేనని అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికైనా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెసె తెలంగాణ ఇస్తుందన్న మా నమ్మకాన్ని తమ పార్టీ వమ్ము చేయదని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు.
కాగా ఇందిరా గాంధీ వ్ధంతి సందర్భంగా ఆయన పానగల్ బైపాస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 1వ తేదిని విద్రోహదినంగా పాటించాలని, అధికారిక కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనకూడదని గుత్తా పిలుపునిచ్చారు.