వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు-వైయస్ యాత్రలకు పోలిక లేదు: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
నల్గొండ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 2003లో చేసిన పాదయాత్రకు పోలికే లేదన్నారు. గతంలో ప్రజా సమస్యల కోసమే వైయస్ పాదయాత్ర చేశారన్నారు.

కానీ ఇప్పుడు బాబు మాత్రం ఓట్లు, సీట్లు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎవరు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదన్నారు. నల్గొండ జిల్లాకు వైయస్సార్ చేసిన అభివృద్ధి పనులన్నీ ప్రస్తుతం కుంటుపడుతున్నాయన్నారు.

తెలంగాణపై 2009 డిసెంబర్ 9వ తేదిన చేసిన ప్రకటనను నిలబెట్టుకోకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ మనుగడ కష్టమేనని అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికైనా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెసె తెలంగాణ ఇస్తుందన్న మా నమ్మకాన్ని తమ పార్టీ వమ్ము చేయదని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు.

కాగా ఇందిరా గాంధీ వ్ధంతి సందర్భంగా ఆయన పానగల్ బైపాస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 1వ తేదిని విద్రోహదినంగా పాటించాలని, అధికారిక కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనకూడదని గుత్తా పిలుపునిచ్చారు.

English summary
Former minister Komatireddy Venkat Reddy said there is no comparison between late YS Rajasekhar Reddy and TDP chief Nara Chandrababu Naidu padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X