శాండి: అంధకారంలో అమెరికన్స్, 45కి చేరినమృతులు

ప్రధాన విమానాశ్రయాలను మూసివేసారు. దాదాపు పదిహేనువేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండో రోజు కూడా మూతపడింది. భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీ కూడా శాండితో ప్రభావితమైంది. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. సహాయక సిబ్బంది కృషి కారణంగానే మరింత ప్రాణనష్టాన్ని నివారించామని తెలిపారు. కాగా శాండి ప్రభావంతో 70 లక్షల మందికి పైగా విద్యుత్ లేక చీకట్లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications