కెసిఆర్కు నాగం జనార్దన్ షాక్: బిజెపి వైపు అడుగులు

తనకు కావాల్సింది పార్టీ కాదని, తెలంగాణ అని ఆయన అన్నారు. బిజెపి నాయకులు తనతో సమావేశమైన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెసు పార్టీయేనని, కాంగ్రెసును బొంద పెడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థమై ఉండేవని ఆయన అన్నారు.
బిజెపిలో కూడా తాను చోరడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం బిజెపి సహా అని పక్షాలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భరోసా యాత్రకు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
నాగం జనార్దన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించలేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఎసిలో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు మోసాలను బయటపెట్టే శక్తులు కలిసి రావాలని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డితో తెలంగాణ కోసం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము అందరితో కలిసి పనిచేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications