అడ్డుకుంటే ఊర్కోం: బాబుమోహన్, యాత్రలో ఫ్యామిలీ
శనివారం మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబూ మోహన్ మాట్లాడారు. తాము ఇతరుల్లా ఆస్తులు కూడబెట్టుకునేందుకు పాదయాత్రలు చేయడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారన్నారు.
కాగా రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర శనివారం కొనసాగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని చంద్రబాబు శంకరపల్లిలో అన్నారు. త్వరలో లోకసభ, శాసనసభలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విశ్వసనీయత అంటే తెలుసా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీ పైనే తాను తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఇవాళ బాబు యాత్ర మెదక్ జిల్లాలో ప్రవేశించనుంది. బాబుతో పాటు కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొంటారు.