గోప్యంగా అజ్మల్కసబ్కు ఉరి: 5నే రాష్ట్రపతి తిరస్కరణ
అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల(నవంబర్)5నే తిరస్కరించారు. కానీ దానిని అది ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. అతనిని రెండు రోజుల క్రితమే అంటే సోమవారమే ముంబయి జైలు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించారు. అక్కడ గోప్యంగా ఈ రోజు ఉదయం ఉరి తీశారు.
కసబ్కు ఉరిశిక్ష అమలు చేసినట్లు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్, కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు ధ్రవీకరించారు. 2008 నవంబర్ 26న కసబ్ సహా పదకొండు మంది ముంబయిలో మారణ హోమం సృష్టించారు. మిగతా ఉగ్రవాదాలు చనిపోగా కసబ్ ఒక్కరే సజీవంగా పట్టుబడ్డాడు. 2010 మే 3న దేశంపై కసబ్ యుద్ధం ప్రకటించినట్లుగా, హత్య కేసు నమోదైంది. బాంబై హైకోర్టు అతనికి ఉరిశిక్షను అమలు పర్చింది.
2011 అక్టోబర్ 11న కసబ్కు బాంబే హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2012 ఆగస్టులో సుప్రీం కోర్టు దానిని సమర్థించింది. ఆ తర్వాత రాష్ట్రపతి అతని క్షమాభిక్షను నవంబర్ 5న తిరస్కరించారు. దీంతో అతనికి ఈ రోజు ఉరి శిక్షను అమలుపర్చారు. కాగా కసబ్ కుటుంబ సభ్యులకు ఉరి విషయాన్ని తెలియజేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.