కిరణ్ని తూర్పారబట్టిన పెద్దిరెడ్డి: జగన్వైపు నో కామెంట్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తొమ్మిదేళ్లు డిసిసి అధ్యక్షుడిగా పని చేశానన్నారు. తన పని తీరుపై జిల్లా నుండి రిపోర్ట్ తెప్పించుకోవచ్చునని అన్నారు. 33 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నానని, అసమర్థ కిరణ్ కారణంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం లేదన్నారు.
కిరణ్ స్పీకర్ నుండి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు మంత్రిగా పని చేసిన అనుభవం లేదని, అలాంటి వ్యక్తి సమర్థవంతంగా ఎలా పని చేయగలడని ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేయని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశారన్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తనను మనస్తాపానికి గురి చేసిందన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
కాంగ్రెసు కిరణ్ సొంత పార్టీ కాదని, తన నియోజకవర్గానికి చివరకు మంచి నీటిని కూడా అడ్డుకుంటున్నారన్నారు. భవిష్యత్తుపై తాను చెప్పాల్సిందేమీ లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారా అంటే జ్యోష్యం చెప్పలేనని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనన్నారు. అయితే తనకు పార్టీ మారాలనే ఆలోచన మాత్రం ప్రస్తుతానికి లేదన్నారు. జగన్ పార్టీలోకి వెళ్తారని మీరు ఊహించుకుంటే తానేమీ చేయలేనన్నారు.
తనతో పాటు మరో నలుగురు రాజీనామా చేయడం లేదని, ప్రస్తుతానికి తాను ఒక్కడినే చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాదం అంటూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సమయంలో కిరణ్ పదే పదే ఢిల్లీకి తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. 2014 వరకు కిరణ్ కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధోగతే అన్నారు. సిఎం కిరణ్ కిషోర్ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాడన్నారు.
ప్రభుత్వ ఖజానాకు కిరణ్ గండి కొడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేని అసమర్థుడు ముఖ్యమంత్రి అన్నారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత నుండి తనపై కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి పెద్దిరెడ్డి ఆరుపేజీల లేఖ రాశారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications