బాధ్యత నాదే: ఒప్పుకున్న చిరు, మజ్లిస్పై బొత్స ఫైర్

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడంపై బాధ్యత తనదే అన్నారు. సభ విరామం సమయంలో విలేకరులు అడగటం వల్లనే తాను కాసేపు మాట్లాడానని చిరంజీవి వివరణ ఇచ్చుకున్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లు క్రెడిట్ దక్కించుకోవాలని చిరు, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అదేవిధంగా సిఎల్పీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణలో మీడియాను అనుమతించకుండా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చిరంజీవి కోసం ఆంక్షలు ఉల్లంఘించాలనే వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఉల్లంఘన బాధ్యత తనదే అని చిరంజీవి ఈ రోజు చెప్పారు. కాగా దీనిపై వైయస్సార్ కాంగ్రెసు స్పీకర్కు ఫిర్యాదు చేసింది.
అక్బరుద్దీన్ పైన బొత్స మండిపాటు
కాంగ్రెసును తెగనాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీలో కీర్తించిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని వైయస్ను పొగుడుతూ... బయ్యారం, బాక్సైట్ గనులు కాంగ్రెసు కేటాయించిందని అక్బరుద్దీన్ విమర్శించడమేమిటని బొత్స ప్రశ్నించారు.
మంచి అయితే వైయస్కు, చెడు అయితే కాంగ్రెసుకు అంటగడతారా అని ప్రశ్నించారు. మంచైనా చెడైనా రెండింటికి తామే బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అయినా బయ్యారం గనుల కేటాయింపు అయినా తమ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications