తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రం ఇస్తే దండుకుంటారు: కావూరి, టిజి సెటైర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao-TG Venkatesh
తిరుపతి/ హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ధనికుల నుంచి పెద్ద యెత్తున డబ్బులు దండుకోవాలనేదే ప్రత్యేకవాదుల ఉద్దేశ్యమని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆరోపించారు. ఆయన సోమవారం ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన సమైక్యాంధ్ర సమరభేరీ సమావేశంలో ప్రసంగించారు. వెనకబాటుతనం ప్రాతిపదికపై రాష్ట్రాన్ని విభజిస్తే లెక్కలేనన్ని ముక్కలు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. రాజకీయాల కోసం విద్యార్థులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్సించారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ధనికుల నుంచి డబ్బులు దండుకుంటారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాదులోని ధనికుల నుంచి కోట్లు వసూలు చేసి, లంచాలు తిని, జేబులు నింపుకోవచ్చునని కొంత మంది ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు కోసమే కొంత మంది రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్ర, రాయలసీమల్లో కూడా వెనకబడిన ప్రాంతాలున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదిక చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

ఆర్థిక అసమానతల కారణంగానే ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను ఆసరా చేసుకుని ప్రాంతీయ పార్టీలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపితే రాష్ట్రాన్ని, దేశాన్ని విభజించాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిలపక్ష సమావేశంపై రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేస్తే ఒకసారి దైవదర్శనం జరుగుతుంది, సమావేశం కూడా జరుగుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. అఖిల పక్ష సమావేశం నుంచి రాయలసీమ నుంచి కూడా ఓ ప్రతినిధిని పంపితే మంచిదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయబోమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనపై ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

ఇదిలావుంటే, కాంగ్రెసు నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ అఖిలపక్ష సమావేశానికి ఎవరు హాజరు కావాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.

English summary
Telugudesam senior leader Yanamala Ramakrishnudu criticized that YSR Congress party president YS Jagan was using Chanchalguda jail as centre for defections. He said that party will send one representative to the all party meeting to be held on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X