హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి తిరుపతి ప్రజారాజ్యం ఎంపీ అభ్యర్థి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వర ప్రసాద రావు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వెలగపల్లి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వర ప్రసాద రావు 2009 సాధారణ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశారు.

వెలగపూడి ఇరవై ఏడేళ్లపాటు తమిళనాడులో వివిధ హోదాల్లో పని చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆయన విఆర్ఎస్ తీసుకొని ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అప్పుడు అతను ఓడిపోయాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వర ప్రసాద్‌కు చిత్తూరు జిల్లాతో మంచి అనుబంధముంది. ఆయనతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కాగా చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వచ్చిన విషయం తెలిసిందే. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిలలో ఒకరు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోగా మరొకరు ఈ నెల 16న చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి జగన్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలిసిందే.

English summary
Retired IAS officer Velagapalli Vara Prasada Rao has joined in YSR Congress party on Monday in the presence of party honorary president YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X