భేటీలో చిరంజీవి ఫోటో చిచ్చు: టి-ఎంపీలకు అవమానం
మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలకు అవమానం జరిగింది. తెలంగాణ ఎంపీలు వేదిక పైకి వెళ్తుండగా పాసులు లేవంటూ అనుమతి నిరాకరించారు. దీంతో వారు వేదిక ముందు బైఠాయించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఎంపీలను బుజ్జగించి వేదిక పైకి తీసుకు వెళ్లారు. అనంతరం పొన్నం తెలంగాణ అమరవీరులకు సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని భేటీలో సూచించారు.
దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ... సమైక్య, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో మంది చనిపోయారని, వారందరికీ సదస్సు తరఫున అధ్యక్షుడిగా తాను సంతాపం తెలియజేస్తున్నానని, అందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటిద్దామన్నారు. ఈ మేథోమధన సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, రాష్ట్ర, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
కేంద్రమంత్రులు పురంధేశ్వరి, జైపాల్ రెడ్డి, ఎంపి హర్షకుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు తాను హాజరయ్యేది లేదని ముందే చెప్పారు. కాగా ఇరు ప్రాంతాల్లో సమైక్య, తెలంగాణ వాదాలతో మృతి చెందిన వారికి సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రెండు ప్రాంతాల వారికి కుదరదని టిఎంపీలు కొద్దిసేపు వాదనకు దిగారు. అనంతరం ఇరు ప్రాంతాల వారికి మౌనం వహించారు.