బాబు మోసం చేస్తే ఉరేసుకుంటావా?: పొన్నం సవాల్
డొంకతిరుగుడు లేకుండా జై తెలంగాణ అంటేనే చంద్రబాబును ప్రజలు నమ్ముతారన్నారు. తెలంగాణకు అనుకూలమని అఖిలపక్షంలో టిడిపి స్పష్టం చేసినప్పటికీ, ఆ పనిని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేయలేదని, అందుకే విస్పష్ట ప్రకటనను డిమాండ్ చేస్తున్నామని వివరించారు. వరంగల్ పాదయాత్రలో జై తెలంగాణ అని రాసి ఉన్న బోనం ఎత్తుకొని ఆ వెంటనే దాన్ని పక్కకు పెట్టి జై తెలుగుదేశం అని రాసిన బోనం ఎత్తుకున్న చంద్రబాబును ఎలా విశ్వషిస్తామన్నారు.
బాబు మోసం చేస్తే హన్మకొండ చౌరస్తాలో ఎర్రబెల్లి ఉరేసుకుంటారా అన్నారు. విస్పష్ట ప్రకటన చేసేలా వరంగల్ ప్రజలు చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గోడమీది పిల్లిలా వ్యవహరించిందని విమర్శించారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటే సింగిల్ ఎజెండా అని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ అనుకూలమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించాకే అఖిలపక్ష సమావేశం ప్రారంభమైందన్నారు.