వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాభిప్రాయం ఎవరైనా గౌరవించాలి: తెలంగాణపై చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
నల్గొండ: కాంగ్రెసు పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కొణిదెల చిరంజీవి మంగళవారం అన్నారు. చిరంజీవి ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటించారు. హుజూర్ నగర్ ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో చిరంజీవి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తెలంగాణ అంశంపై స్పందించారు. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు.

కేవలం కాంగ్రెసు పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని గతంలోనే చెప్పారని తెలిపారు. చిరంజీవితో పాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ కూడా నల్గొండలో పర్యటించారు.

కేంద్రమంత్రులు ముగ్గురు రూ.240 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. హుజూర్ నగర్‌లో మూడు వేల ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు. కాగా ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. జనాలు మెగాస్టార్‌ను చూసేందుకు ఎగబడటంతో కొద్దిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.

English summary
Central Minister Chiranjeevi has said on Tuesday in Nalgonda district that he can respect people demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X