తెలంగాణ కాదు, విద్యుత్తే పెద్ద సమస్య: ముఖ్యమంత్రి

రాష్ట్రంలో విద్యుత్తు సమస్య కారణంగా చిన్నాచితకా కుటుంబాలకు ఎటువంటి నష్టం లేదని, కేవలం పెద్ద పరిశ్రమలకే ఇబ్బందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో విద్యుత్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నా, ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాకపోవడం వల్లనే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలకు సంబంధించి మార్చి దాటే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రజలకు నిజం తెలియజేయాల్సి ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
గ్యాస్, బొగ్గు కొరత వల్ల విద్యుత్తు సమస్య తీవ్రమైందని, రిలయన్స్ నుంచి ర్రాష్టానికి రావాల్సిన వాటా దక్కినట్టయితే భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు తలెత్తవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడామని, అవసరమైతే కోర్టుని ఆశ్రయించినా మనకు న్యాయం జరిగే అవకాశముందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications