గర్నాథ్ రెడ్డిపై ఫిర్యాదులు, మన హైదరాబాద్ కూడా

తెలంగాణ ఇస్తే విధ్వంసం, రక్తపాతం సృష్టిస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు గుర్నాథరెడ్డిపై హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. తెరాస ప్రతినిధులు బంజారాహిల్స్ స్టేషన్లోను, న్యాయవాద జెఎసి సభ్యులు జూబ్లీహిల్స్స్టేషన్లోను ఫిర్యాదు చేశారు. గుర్నాథరెడ్డిపై ఐపీసీ 153(ఏ), 153(బీ), 504, 505(2) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెరాస నాయకుడు శ్రవణ్ నేతృత్వంలో ప్రతినిధులు కోరారు.
శానససభ్యుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన నిలదీశారు. చిన్నచిన్న నేరాలు చేసిన వారిని అరెస్ట్చేసే పోలీసులు, రక్తపాతం సృష్టిస్తామని వ్యాఖ్యలుచేస్తే ఎలా ఊరుకున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదంపై గౌరవం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఏం చెబుతారని, గౌరవం అంటే రక్తపాతం సృష్టించడమేనా అని అడిగారు.
శాసనసభ్యుడు గురునాథరెడ్డిపై 153(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని అడ్వకేట్ జేఏసీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యతగల ప్రజాప్రతినిధి రెచ్చగొట్టేలా వాఖ్యానించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో అన్నారు. ప్రత్యేకరాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో ఉండి మంత్రాంగం చేస్తున్నారని జేఏసీ నాయకుడు కె గోవర్ధన్రెడ్డి ఆరోపించారు.
మజ్లీస్తో పొత్తు పెట్టుకొని మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గురున్నాథరెడ్డితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications