జగన్ పార్టీ డైరెక్టర్ల రాజీనామా!: సిఎంపై భూమన ఫైర్
సోమవారం ఇది కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. రాజీనామాకు సిద్ధపడిన వారిలో ప్రభాకర్ రెడ్డి, నారాయణ, వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు. టౌన్ బ్యాంకు ఎన్నికల అక్రమాలపై తాము సొసైటీ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.
కిరణ్పై భూమన నిప్పులు
టౌన్ బ్యాంకు ఎన్నికల్లో అధికార కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడిందని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన వారే ఎక్కువమంది అభ్యర్థులు గెలిచినప్పటికీ ఓడినట్లుగా అధికారులు ప్రకటించారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఒత్తిడి మేరకే అధికారులు గెలిచిన తమ అభ్యర్థులు ఓడినట్లుగా ప్రకటించారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నీచ రాజకీయాలకు ఈ ఎన్నికలు నిదర్శనం అని దుయ్యబట్టారు.