హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ ముప్పు: పేలుళ్ల సూత్రధారి యాసిన్ భత్కల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad Blasts
హైదరాబాద్: దేశంలో మరోసారి దాడులు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణె, ఢిల్లీ సహా దేశంలోని ఇతర నగరాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో దేశంలోని పలు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

ఇదిలావుంటే, హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కిరాతకం ఇండియన్ ముజాహిదీన్ పనే అని దర్యాప్తు అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ పేలుళ్ల ప్రధాన సూత్రధారిగా యాసిన్ భత్కల్‌గా అనుమానిస్తున్నారు. ఇతను రియాజ్ భత్కల్‌తో పాటు 2007 హైదరాబాద్ జంట పేలుళ్లు, పూణే బేకరీ పేలుళ్లు, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్ల ఘటనల్లో పాలు పంచుకున్నాడు.

దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనలో 5 నుంచి 8 మంది పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. వీరు కర్ణాటకకు చెందినవారని అనుమానిస్తున్నారు. వీరికి స్థానికులు సహకరించారని భావిస్తున్నారు. అఫ్జల్ గురు ఉరి తర్వాత హదరాబాదుతో పాటు పలు నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చునని తాము హెచ్చరికలు పంపించామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హైదరాబాదుతో పాటు బెంగుళూర్, ముంబై, కోయంబత్తూర్, హుబ్లీ నగరాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపింది.

టిఫిన్ బాక్సుల కలకలం

హైదరాబాదులోని బేగంపేటలో టిఫిన్ బాక్స్ ఒకటి కలకలం సృష్టించింది. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో వదిలేసిన సైకిళ్లను, టిఫిన్ బాక్సులను, సూట్‌కేసులను చూస్తే హైదరాబాద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బేగంపేటలో వదిలేసిన టిఫిన్ బాక్సులో బాంబు ఉందని పుకార్లు వ్యాపించాయి. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఏమీ లేదని తేల్చారు.

English summary
According to investigating teams - Indian Mujahiddin is responsible for the Dilsukhnagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X