మావోయిస్ట్ల మధ్య భీకర కాల్పులు: 15మంది మృతి
ఒరిస్సా - జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. మావోయిస్టు నేత అరవింద్ సహా పదిహేను మంది మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మావోయిస్టులు, సిఆర్పిఎఫ్ వర్గాల మధ్య కాల్పులు జరిగాయని భావిస్తున్నప్పటికీ అలాంటి ఛాయలు కనిపించడం లేదంటున్నారు. మావోయిస్టుల్లోని రెండు వర్గాల మధ్య జరిగిన భీకర పోరులోనే వీరు హతమైనట్లుగా భావిస్తున్నారు. సిపిఐ(మావోయిస్ట్), ట్రిటియా ప్రస్తితు కమిటీ(టిపిసి) వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.
గతంలో పోలీసు బలగాల నుంచి దొంగిలించిన పలు ఆయుధాలను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గురువారం ఉదయం మృతదేహాలను గుర్తించారు. టెన్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఎకె 47, కార్బైన్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలన పోలీసులు గుర్తించారు.