విజయమ్మ అమ్మమ్మ మృతి: షర్మిల పాదయాత్రకు బ్రేక్
ఆమె మృతి చెందిన విషయం తెలియడంతో పాదయాత్రలో ఉన్న షర్మిల హుటాహుటిన కడపకు బయలుదేరారు. బంధువు మృతి చెందిన కారణంగా షర్మిల పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తదుపరి షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది. అయితే, ఒకరోజు మాత్రమే ఆమె విరామం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
అంతకుముందు పాదయాత్రలో పాల్గొన్న షర్మిల ప్రస్తుత ప్రభుత్వం వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డిని విరుస్తోందని మండిపడ్డారు. ఆమె జొన్నలపాడు గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాజన్న రాజ్యంలోనే అన్ని వర్గాలు లాభపడ్డాయన్నారు. తన సోదరుడు జగన్ వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారన్నారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలిస్తారన్నారు. రాష్ట్రాన్ని వైయస్ హరితాంధ్రప్రదేశ్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆంధకార ప్రదేశ్గా మార్చిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చెప్పినట్లుగానే కిరణ్కు బుద్ధి చెప్పాలన్నారు.