వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రోహి.. సినిమాలనుండి దండుకోవడమే: కెసిఆర్‌పై కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Kodela Sivaprasad Rao
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు బుధవారం నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కెసిఆర్ ఓ దేశ ద్రోహి అని, ప్రజా ద్రోహి అని ధ్వజమెత్తారు. తెరాస ఓ దుర్మార్గపు పార్టీ అన్నారు. సినిమా, విద్య, వ్యాపార సంస్థల నుంచి డబ్బులు దండుకున్నారని విమర్శించారు. స్పష్టతతోనే తెలంగాణ వస్తుందన్నారు. నలుగురిని చంపితేనో, నలుగురు కలిసి గావుకేకలు పెడితేనో తెలంగాణ రాదని అన్నారు.

నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బయ్యారం గనులను తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ సంస్థకు కేటాయించినప్పుడు స్పందించని కెసిఆర్ ఇప్పుడు మాత్రం గావుకేకలు పెడుతున్నారన్నారు. తెలంగాణవాదం ముసుగులో డబ్బులు దండుకున్నంటున్న తెరాస, అవినీతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను అంతమొందించేందుకు విశాఖ సభ నాంది పలుకబోతుందన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పేరిట తిరుగుతున్నారని దుయ్యబట్టారు.

English summary
Telugudesam Party senior leader Kodela Sivaprasad Rao has blamed TRS chief K Chandrasekhar Rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X