మంత్రులు జైలుకు!: రాయపాటి, షర్మిల 'రక్షణ'పై బొత్స
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దర్యాఫ్తు చేస్తోందన్నారు. విచారణ పూర్తయితే మరికొంత మంది మంత్రులు జైలుకెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణకు పరిష్కారం: డిఎల్
బయ్యారం గనులను విశాఖ స్టీల్కు కేటాయించడం సరైన నిర్ణయమేనని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కడప జిల్లాలో అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. అన్నింటికి రాజకీయ రంగు పులుమవద్దన్నారు. పార్లమెంటు సమావేశాల అనంతరం తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం, కడప జిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అడ్రస్ చూస్తే తెలుస్తుంది: బొత్స
రక్షణ స్టీల్స్ డైరెక్టర్లు, కార్యాలయాల అడ్రసులు చూస్తే ఎవరివో తెలుస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. రక్షణ స్టీల్స్కు బయ్యారం గనుల కేటాయింపు వ్యవహారం మంత్రివర్గం దృష్టికి రాలేదన్నారు. ఉత్తర్వులు వచ్చినప్పుడు తనతో సహా కొందరు తప్పు పట్టారని, రక్షణ స్టీల్స్ ఎవరిదో, కొండల రావు ఎవరో అందరికీ తెలుసునని అన్నారు.