రేప్ చేసి వీడియోలతో బెదిరింపు: యువతి ఆత్మహత్య
ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లా భత్పరాణి ప్రాంతంలో ఐదేళ్ల పాపపై 15 ఏళ్ల కుర్రాడు అత్యాచారం జరిపాడు. ఇలాంటిదే మరో ఘటన మధ్యప్రదేశ్లో జరగగా, బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. చందోలీకు చెందిన గిరిజన బాలికను మైనర్ కుర్రాడు బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడింది.
అత్యాచారం జరిపి ఆ అశ్లీల దృశ్యాలను పదిమందికి చూపిస్తానంటూ బెదిరించడంతో ఓ గర్భిణి మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకొంది. థానేకు చెందిన మహ్మద్ సుల్తాన్ అలియాస్ రాజా(27) ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనారిటీ తీరని అమ్మాయిపై అత్యాచారం జరిపాడు. ఆ దృశ్యాలను బయటపెడతానంటూ పూర్తిగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో తాను గర్భం దాల్చినట్టు ఆమె గుర్తించింది. విషయం ఇంట్లో తెలుస్తుందేమోనని భయపడి.. కిరోసిన్ పోసుకొని అంటించుకుంది.
ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్లో 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇదే రాష్ట్రంలోని బన్సదేశ్ ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. జైపూర్లో ఓ కూలీపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు, ఢిల్లీ బాలిక వేగంగా కోలుకుంటున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.