తెలంగాణపై వాయలార్ రవి రొటీన్: టిడిపిపై జోషీ

తెలంగాణపై ఏం జరుగుతుందనేది తనకు తెలియదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యుపిఎ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే తెలంగాణ అంశం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తన పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు.
కళంకిత మంత్రులపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. చర్యలు తీసుకోవాలా, వద్దా అనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డికే వదిలేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తానేమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చూడడం లేదని ఆయన అన్నారు.
ఎన్డియే అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు గుర్తుకు రారరని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అన్నారు. వారే తమతో కలుస్తారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై మైనారిటీ వ్యతిరేక ముద్ర వేసేవారికి తాము అధికారంలోకి ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు.
యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు. విదేశీ సంబంధాలపై వాజ్పేయి విధానాలే తమకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. సిబిఐ, కాగ్ వంటి సంస్థలకు స్వయంప్రతిపత్తి ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. సిబిఐ విషయంలో రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications