డిఎల్ రవీంద్ర వస్తారని సిఎల్పీ మీడియా రూంకు తాళం
మొదట సిఎల్పీలోని మీడియా గదిని సిబ్బంది తెరిచారు. ఆ తర్వాత డిఎల్ రవీంద్రా రెడ్డి వస్తారేమోనని భావించిన సిబ్బంది వెంటనే తెరిచిన గదికి హడావుడిగా తాళం వేసింది. దీంతో డిఎల్ ప్రెస్ మీట్కు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డిఎల్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతారనే కారణంతోనే మీడియా సమావేశానికి సిఎల్పీ నిరాకరించింది.
గతంలో మాజీ మంత్రి శంకర రావుకు కూడా సిఎల్పీలో ప్రెస్ మీట్కు నిరాకరించారు. శంకర రావు సైతం డిఎల్ విధంగానే గతంలో పదవిని కోల్పోయారు. శంకర రావు నిత్యం కిరణ్ను టార్గెట్ చేశారు. దీంతో గతేడాది ఆయనను మంత్రి వర్గం నుండి కిరణ్ తొలగించారు. డిఎల్ కూడా కిరణ్ను ఎప్పటి నుండో టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయనను మూడు రోజుల క్రితం బర్తరఫ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారని డిఎల్ ప్రెస్ మీట్కు అనుమతిని నిరాకరించారు.
డిఎల్తో డిప్యూటీ భేటీ
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం డిఎల్తో దాదాపు పావుగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం డిఎల్ సిఎల్పీకి బయలుదేరారు. సిఎల్పీలో భేటీకి అనుమతివ్వక పోవడంతో ఆయన బయటే మాట్లాడే అవకాశముంది.