కానిస్టేబుల్ నిర్వాకం: ప్రేయసిని హత్య చేసి పాతిపెట్టాడు
అయితే, పెళ్లి చేసుకోవాల్సి వచ్చేసరికి మాట మార్చాడు. వారిద్దరు ఏకాంతంగా హద్దులు దాటడంతో యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను నెమ్మదిగా దూరం పెట్టాడు. ఈ దశలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కానిస్టేబుల్ మల్లేష్ సిద్ధపడ్డాడు.
ఆ విషయం తెలిసిన నాంకీ మల్లేష్ని నిలదీయడంతో 25 రోజుల క్రితం యువతిని నల్లమల అడువుల్లోకి తీసుకెళ్లి హతమార్చి అక్కడే పూడ్చి పాతిపెట్టాడు. తమ కూతురు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు దీంతో మల్లేష్ను అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
దాంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతదేహాన్ని తవ్వి వెలికి తీశారు. హత్య జరిగి చాలా రోజులు కావడంతో కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మల్లేష్ను అరెస్టు చేశారు.