వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కానిస్టేబుల్ నిర్వాకం: ప్రేయసిని హత్య చేసి పాతిపెట్టాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Constable kills lover in Mahaboobnagar
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఓ యువతి ప్రేమ విషయంలో మోసపోయి హత్యకు గురైంది. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన కానిస్టేబుల్ ఈ హత్యకు పూనుకోవడం గమనార్హం. పాలమూరు జిల్లా ఖిల్లా గణపురం షాపూర్‌కు చెందిన నాంకీ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన మల్లేష్ అనే కానిస్టేబుల్ ప్రేమించానని నమ్మించాడు.

అయితే, పెళ్లి చేసుకోవాల్సి వచ్చేసరికి మాట మార్చాడు. వారిద్దరు ఏకాంతంగా హద్దులు దాటడంతో యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను నెమ్మదిగా దూరం పెట్టాడు. ఈ దశలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కానిస్టేబుల్ మల్లేష్ సిద్ధపడ్డాడు.

ఆ విషయం తెలిసిన నాంకీ మల్లేష్‌ని నిలదీయడంతో 25 రోజుల క్రితం యువతిని నల్లమల అడువుల్లోకి తీసుకెళ్లి హతమార్చి అక్కడే పూడ్చి పాతిపెట్టాడు. తమ కూతురు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు దీంతో మల్లేష్‌ను అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

దాంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతదేహాన్ని తవ్వి వెలికి తీశారు. హత్య జరిగి చాలా రోజులు కావడంతో కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మల్లేష్‌ను అరెస్టు చేశారు.

English summary
A constable killed his lover in Mahaboobnagar district. Police suspected constable Mallesh in the murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X