ఎపిపిఎస్సీ: ఓ గ్రామంలో దాక్కున్న కిలాడీ సంధ్యా అరెస్ట్

ఆరోపణలు వచ్చినప్పటి నుండి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ఐదు రోజులుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా రాణిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆమెకు ఈ నెల 24వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు.
ఆ వెంటనే పోలీసులు సంధ్యా రాణిని చంచల్గూడలోని మహిళా జైలుకు తరలించారు. సంధ్యను కస్టడీలోకి తీసుకొని మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలని సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే జరిపిన విచారణలో ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే కుమారుడి ద్వారా ఎపిపిఎస్సీ సభ్యుడు సీతారామరాజు తనకు పరిచయం అయ్యారని సంధ్య పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీతారామరాజు హామీ మేరకే తాను నిరుద్యోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆమె చెప్పారని సమాచారం. హైదరాబాదులోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పరిచయం చేసుకొని, అలా నిరుద్యోగులను పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంధ్య పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications