కిడ్నాప్కు గురైన మూడేళ్ల బాలుడి దారుణ హత్య

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఓబులక్కపల్లె శివారులో బాలుడి శవం పాతిపెట్టి ఉంది. నిందితులు బాలుడిని గొంతు నులిమి హతమార్చారు. హర్షిత్ రెడ్డి కిడ్నాప్ తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడి కోసం గాలించారు. ఈ రోజు ఆ చిన్నారి శవమై కనిపించాడు.
హర్షిత్ రెడ్డి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి కిడ్నాపర్లు అంత మొత్తం డిమాండ్ చేయడంతో పోలీసులు కుట్ర కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. అంతేకాకుండా కిడ్నాప్ చేసిన రోజునే చంపడం చూస్తుంటే కూడా కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లలో ద్వారకా తిరుమలకి చెందిన ఓ బస్సు మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications