బన్సల్ను వదిలేశారేం?: అంబటి, పార్టీ ప్లీనరీ వాయిదా
అలాంటిది బన్సల్ను సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో నిందితుడిగా కాకుండా 39వ సాక్షిగా పేర్కొని బన్సల్కు ఆ వ్యవహారంలో ప్రయేయం లేనట్టు చెప్పాడంలో ఆంతర్యమేమిటని సిబిఐని ప్రశ్నించారు. అదే సమయంలో తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టడమేమిటని ప్రశ్నించారు. బన్సల్కో న్యాయం, జగన్కో న్యాయమా అని ప్రశ్నించారు. ఏనాడు సచివాలయానికి జగన్ను అరెస్టు చేయడం దారుణమన్నారు.
ప్లీనరీ వాయిదా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని పంచాయితీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మైసూరా రెడ్డి చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది.
ప్లీనరీ సమావేశం తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ నాయకురాలు షర్మిల నిర్వహించే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర యథావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ యాత్రలో ఎటువంటి మార్పు ఉండబోదన్నారు. వైయస్ జయంతి రోజున పెద్ద ఎత్తున రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.