ఓటు జగన్ విడుదలకు మార్గం: షర్మిల, యాత్ర రికార్డ్

రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. తమను ఆశీర్వదించాలని, ఆశీస్సులివ్వాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధమని, తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నామన్నారు.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్పోర్టు, ఎన్ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.
గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల చేపట్టిన యాత్ర శుక్రవారానికి రెండు వందల రోజులను పూర్తి చేసుకోనుంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు అడుగుపెట్టడంతో వంద నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకుంటుంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications