వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు జగన్ విడుదలకు మార్గం: షర్మిల, యాత్ర రికార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila will complete 200 days
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మీరు వేసే ఓటు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలకు మార్గమవుతుందని ఆ పార్టీ నేత షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో గురువారం అన్నారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖలో జరుగుతోంది. శుక్రవారంతో యాత్ర 100 నియోజకవర్గాలలో 200 రోజులు పూర్తి చేసుకుంటుంది. గురువారం యాత్రలో ఆమె మాట్లాడారు.

రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. తమను ఆశీర్వదించాలని, ఆశీస్సులివ్వాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధమని, తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నామన్నారు.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 199వ రోజు గురువారం విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, శీలానగర్, ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఏటీ జంక్షన్ మీదుగా షర్మిల నడిచారు. కంచరపాలెం మెట్ట వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు.

గురువారం మొత్తం ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,652.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల చేపట్టిన యాత్ర శుక్రవారానికి రెండు వందల రోజులను పూర్తి చేసుకోనుంది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు అడుగుపెట్టడంతో వంద నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకుంటుంది.

English summary
YSR Congress Party leader Sharmila will complete Two Hundred days her padayatra on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X