మామ మృతి: నిమ్మగడ్డకు బెయిల్, 6 నుండి 8 వరకు

నిమ్మగడ్డ మామ రాంప్రకాశ్ ఆర్య ఈ రోజు ఉదయం చనిపోయారు. ఆయన వయస్సు 89. ఆయన కర్మకాండ చేసేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు పదమూడు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిమ్మగడ్డ ఈ రోజు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన మామ చనిపోయారని, ఆయన కర్మకాండ కోసం పదిహేను రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు.
ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పదమూడు రోజులు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. తిరిగి సాయంత్రం ఆయన జైలుకు రావాల్సి ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఆయన వెంట ముగ్గురు మఫ్టీ పోలీసులు ఉంటారు. రూ.25వేల పూచీకత్తును సమర్పించారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్పిక్ అంశం పైన నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు. ఆయన చంచల్గూడ జైలులో ఉంటున్నారు. జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు అరెస్టై జైలులో ఉన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications