వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూలర్ తర్వాత బాలకృష్ణ, యూత్ టార్గెట్‌గా నారా లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna - Nara Lokesh
హైదరాబాద్: ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2014లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు యాత్రలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రను పూర్తి చేసిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టులో బస్సు యాత్ర చేపట్టనున్నారు. వస్తున్నా మీకోసంలో తాను తిరగని జిల్లాలను ఆయన చుట్టి రానున్నారు.

బాబు దారిలోనే హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్‌లు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న రూలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాను సాధారణ ఎన్నికలకు ముందు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం షూటింగులో బిజీగా ఉన్న బాలయ్య అది పూర్తవగానే ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో యాత్ర చేయాలని భావిస్తున్నారట. ఆయన అన్ని జిల్లాలను చుట్టి వచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కొంతకాలం క్రితం వరకు పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే బాబు పాదయాత్ర తర్వాత మారింది. బాబు బస్సు యాత్రతో మరింత మారుతుందని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక బాలకృష్ణ యాత్ర.. ఆ తర్వాత ప్రచారంలోకి దిగితే తెలుగుదేశానికి తిరుగుండదని భావిస్తున్నారు. మరోవైపు కేవలం యువతే లక్ష్యంగా నారా లోకేష్ కూడా ఓ యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అవినీతి, పాలన పైన యువతలో రాజకీయ చైతన్యం కలిగించాలని లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నారట.

English summary
It is said that Hero and Telugudesam party leader Nandamuri Balakrishna plans to undertake a state tour after completing his film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X