బాబుపై అక్కడే దాడి, 'టి' ఇస్తే టిఆర్ఎస్ విలీనం: వివేక్

తెలంగాణలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే హైదరాబాదులో నివసించే ఇతర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు. తెలంగాణపై ఎలాంటి ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రం తప్ప ఎవరూ ప్యాకేజీలు కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతంలోనే నక్సలిజం మొదలైందని తాను షిండేకు చెప్పానన్నారు.
నీరు, విద్యుత్ తదితర సమస్యలపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవచ్చునన్నారు. విభజన ద్వారా మావోల ప్రభావం పెరుగుతుందనే వాదనలో వాస్తవం లేదని ఆయనకు చెప్పానన్నారు. సీమాంధ్రలోనే నక్సల్స్ ప్రభావం ఎక్కువన్నారు. చంద్రబాబు పైన గతంలో అక్కడే దాడి జరిగిందన్నారు. రాష్ట్రం విడిపితో ఇబ్బందులు ఉండవని చెప్పానన్నారు. తెలంగాణ ప్రస్తుతం కీలక దశలో ఉందన్నారు. గతంలో వేసిన ప్యాకేజీలు, కమిటీలు ఫెయిల్ అయ్యాయని, కొత్తగా ఇచ్చినా లాభం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు కూడా విభజన కోరుకుంటున్నారన్నారు.
సోనియా వద్ద రాజీనామా
తన రాజీనామా పత్రం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఉందని వివేక్ చెప్పారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో చేరుతారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తెరాసే విలీనం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నారనే విషయమై మాట్లాడేందుకు వివేక్ నిరాకరించారు.
కాగా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంటోనీని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కలిశారు.












Click it and Unblock the Notifications